5 గ్రామాల విలీనం.. ఏపీ ఏం చెప్పిందంటే?

54చూసినవారు
5 గ్రామాల విలీనం.. ఏపీ ఏం చెప్పిందంటే?
తెలంగాణ నుంచి ఏపీలో కలిపిన కన్నాయిపాలెం, గుండాల, ఎటపాక, పురుషోత్తపట్నం, పిచుకలపాడు గ్రామ పంచాయతీలను తమకు తిరిగి ఇవ్వాలన్న సీఎం రేవంత్ ప్రతిపాదనలపై ఏపీ అధికారులు స్పందించారు. ఒక రాష్ట్రంలోని గ్రామాలను వేరే రాష్ట్రంలో కలపాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని గుర్తు చేశారు. అటు హైదరాబాద్‌లో ఏపీ ప్రభుత్వానికి భవనాలు కేటాయించేందుకు నిరాకరించిన ప్రభుత్వం.. దరఖాస్తు చేసుకుంటే స్థలం ఇస్తామని బదులిచ్చింది.

సంబంధిత పోస్ట్