కాపు నేతలతో నాగబాబు రహస్య భేటీ!

575చూసినవారు
కాపు నేతలతో నాగబాబు రహస్య భేటీ!
ఏపీ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపు టార్గెట్‌గా ఎవరి వ్యూహాలకు వారు పదునుపెడుతున్నారు. తాజాగా జనసేన నేత నాగబాబు కాపు నేతలు, వ్యాపార ప్రముఖులతో రహస్యంగా సమావేశం అయ్యారని తెలుస్తోంది. విశాఖ బీచ్ రోడ్డులో ఉన్న ఓ కన్వెన్షన్ సెంటరులో జరిగిన ఈ రహస్య సమావేశంలో కీలక అంశాలపై చర్చ సాగినట్లుగా సమాచారం. ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేసినట్లుగా ప్రచారం సాగుతోంది.

సంబంధిత పోస్ట్