కార్మికుని కుటుంబాన్ని ఆదుకున్న సంఘం సభ్యులు

55చూసినవారు
కార్మికుని కుటుంబాన్ని ఆదుకున్న సంఘం సభ్యులు
ఆళ్లగడ్డ మండలం నల్లవాగుపల్లె గ్రామస్థుడు మహబూబ్ బాషా అనే కార్మికుడు రెండు నెలల క్రితం ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది. మంగళవారం రోజున ఆళ్లగడ్డ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వారి కుటుంబానికి ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు స్పందించి వారికి తోచిన విధంగా సహకారం అందించగా మొత్తం 26, 600 రూపాయలు ఆ కుటుంబానికి అందజేయడం జరిగిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్