అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామికి వైభవంగా తిరుమంజనం

85చూసినవారు
ఆళ్లగడ్డ మండల పరిధిలో గల దిగువ అహోబిలంలో స్వాతి నక్షత్రం సందర్భంగా వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా బుధవారం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి ప్రత్యేక అలంకరణలు చేపట్టి తిరుమంజనం అత్యంత వైభవంగా జరిపారు. స్వామి అమ్మవార్లకు చేపట్టిన అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఆలయానికి వచ్చిన భక్తులకు లక్ష్మీనరసింహస్వామి వారి తీర్థ ప్రసాదా లను ఆలయ అర్చకులు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్