జగన్ ఎంతమంది ఎమ్మెల్యేలను మార్చిన టిడిపి అధికారంలోకి రావడం ఖాయమని ఆలూరు టిడిపి ఇన్చార్జి కోట్ల సుజాతమ్మ తెలియజేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పత్తికొండలో 28న నిర్వహించనున్న రా కదలి రా బహిరంగ సభ ను విజయవంతం చేయాలని శుక్రవారం పార్టీ కార్యకర్తలు, నాయకులను కోరారు. ఈ కార్యక్రమంలో మురళీమోహన్, తిప్పయ్య, విజయభాస్కర్ గౌడ్, విష్ణువర్ధన్ రెడ్డి, శేషగిరి తదితరులు పాల్గొన్నారు.