కోడుమూరు పట్టణంలోని సచివాలయం ఉద్యోగి డిజిటల్ అసిస్టెంట్ రమేష్ కు శనివారం ఎంపీడీవో దివ్య షోకాజ్ నోటీసును జారీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. కోడుమూరు మండలంలోని అన్ని గ్రామాల్లో పని చేస్తున్న సచివాలయ ఉద్యోగులు తప్పనిసరిగా సమయపాలన పాటించాలని సూచించారు. సచివాలయం ఉద్యోగస్తులు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలన్నారు.