ఆత్మకూరు పట్టణంలోని అతి ప్రాచీన సిద్దేశ్వర స్వామి ఆలయంలో సోమవారం స్వామివారికి ప్రీతికరం కావడంతో విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రాతఃకాల సమయం నుంచి సిద్దేశ్వర, పార్వతీదేవి అమ్మవారికి అభిషేకలు, అర్చనలు, తదితర పూజా క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అలాగే మహా గణపతికి సాంప్రదాయ పూజలు నిర్వహించారు. అంతేకాకుండా ఆలయ పరిధిలోని నాగుల కట్టకు భక్తులు పూజలు నిర్వహించారు.