నీటి ఎద్దడి నివారణకు చర్యలు

66చూసినవారు
నీటి ఎద్దడి నివారణకు చర్యలు
పల్నాడు జిల్లా వెల్దుర్తి మండల పరిదిలోని రచ్చమల్లపాడు గ్రామంలో వాటర్ ఎయిడ్ ఇండియా ఆధ్వర్యంలో నీటి వినియోగదారుల సంఘాల సమావేశం జరిగింది. సమావేశానికి ముందు మంచి నీటి ట్యాంకు పనితీరును బ్లాక్ కోఆర్డినేటర్ మాడెబోయిన గురు ప్రసాద్, సి ఫ్ రవి వర్మలు పరిశీలించి సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గురు ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు, వినియోగించిన నీటిని, వాననీటిని ఎక్కడికక్కడ భూమి లోపలకి ఇంకింప చేయాలని తెలిపారు.