లిక్కర్ స్కాంకు కారకులైన ప్రతి ఒక్కరిని శిక్షించాలి: పవన్

543చూసినవారు
లిక్కర్ స్కాంకు కారకులైన ప్రతి ఒక్కరిని శిక్షించాలి: పవన్
గత ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కాంపై సీఎం చంద్రబాబు అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను ఉద్దేశించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. శ్వేతపత్రంలో చెప్పిన దాని కంటే ఎక్కువ అక్రమాలు జరిగాయని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ అక్రమాల వల్ల రాష్ట్ర ఖజానాకు 18వేల కోట్ల నష్టం వాటిల్లిందని ఆరోపించారు. తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదని పవన్ వార్నింగ్ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్