పవన్.. ప్రజలను రెచ్చగొడుతున్నారు: మాజీ ఎంపీ

67చూసినవారు
పవన్.. ప్రజలను రెచ్చగొడుతున్నారు: మాజీ ఎంపీ
తిరుమల లడ్డూ వివాదంపై హిందువులంతా రోడ్లపైకి రావాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చిన వ్యాఖ్యలపై మాజీ ఎంపీ హర్షకుమార్ స్పందించారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉండి పవన్ కళ్యాణ్ ప్రజలను రెచ్చగొడుతున్నారని, వెంటనే ఆయనను డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు. కుట్రతోనే సీఎం చంద్రబాబు లడ్డూ ఆరోపణలు చేస్తున్నారని, కల్తీపై ఆయన వద్ద ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. సిట్ ఏర్పాటు వల్ల ఎలాంటి ఉపయోగం లేదని, సీబీఐతో విచారణ జరిపించాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్