వరదలో చిక్కుకున్న 150 మంది విద్యార్థులు.. కాపాడిన అధికారులు (వీడియో)

72చూసినవారు
విజయవాడలో పెద్దవాగు వరద ఉధృతిలో చిక్కుకున్న వారిని అధికారులు కాపాడారు. నిన్న సాయంత్రం కురిసిన భారీ వర్షానికి నున్న ప్రాంతం సమీపంలోని పెద్దవాగుకి వరద ఉధృతి పెరిగింది. ఈ క్రమంలో 150 మంది విద్యార్థులు, రైతులు చిక్కుకున్నారు. కలెక్టర్ సృజన ఆదేశాలతో సహాయక బృందాలు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. విద్యార్థులు, రైతులను కాపాడి ఒడ్డుకు చేర్చారు.

సంబంధిత పోస్ట్