ఆర్యవైశ్యులకు అండగా సీఎం జగన్
ఆర్యవైశ్య సోదరులకు అన్నీ విధాలుగా సీఎం జగన్ అండగా ఉంటారని మంత్రి, సంతనూతలపాడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగ నాగార్జున అన్నారు. సోమవారం నాగులప్పలపాడు మండలం ఉప్పుగుండూరులో ఆర్యవైశ్య సోదరుల ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. నిరుపేద ఆర్యవైశ్యులకు ఇళ్ల స్థలాల పట్టాలను ఇచ్చామని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను ఆదరించాలని కోరారు.