ఆస్తి తగాదాలు.. తండ్రిని చంపిన కొడుకు

77చూసినవారు
ఆస్తి తగాదాలు.. తండ్రిని చంపిన కొడుకు
అనంతపురం జిల్లా యాడికిలో దారుణ హత్య జరిగింది. ఆస్తి తగాదాలతో తండ్రి లక్ష్మీనారాయణను పెద్ద కొడుకు కార్తీక్ హతమార్చాడు. రాళ్లతో కొట్టి, కత్తితో గొంతు కోశాడు. లక్ష్మీనారాయణకు ఇద్దరు భార్యలు. ఐదెకరాల పొలం విషయం ఇద్దరు భార్యల పిల్లల మధ్య గత కొంతకాలంగా ఆస్తి వివాదం కొనసాగుతోంది. కోర్టులోనూ కేసు నడుస్తోంది. ఈ క్రమంలో తండ్రిని పెద్ద కొడుకు హత్య చేయడం సంచలనంగా మారింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.