పోలవరం ప్రాజెక్టుపై బహిరంగ చర్చకు సిద్ధమని మాజీ ఎంపీ, వైసీపీ నేత మార్గాని భరత్ సవాల్ విసిరారు. పోలవరం ప్రాజెక్టు ఈ దుస్థితికి గత టీడీపీ ప్రభుత్వ నిర్వాకమే కారణమని ఆయన మండిపడ్డారు. జాతీయ ప్రాజెక్టును అసలు కేంద్రానికే వదిలి పెట్టి ఉంటే బాగుండేదని విమర్శలు గుప్పించారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన నివేదిక ప్రజలను మోసం చేయడానికేనని భరత్ ఆరోపించారు.