ఏపీ ప్రభుత్వం నిరుపేదలకు గుడ్ న్యూస్ చెప్పింది. నేటి నుండి వచ్చే నెల 9వరకు పేదలకు అందించిన ఇళ్ల పట్టాలకు ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేయనుంది. ఈ ఉచిత రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వీఆర్వోలు నిర్వహిస్తారని, జిల్లా కేంద్రాల్లో జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించింది.