ఏపీ సర్కార్ చేతికి శాంతి రిపోర్ట్

567చూసినవారు
ఏపీ సర్కార్ చేతికి శాంతి రిపోర్ట్
ఏపీలో దేవాదాయ శాఖ ఉప కమిషనర్ గా పనిచేస్తూ సస్పెండైన శాంతిపై ఆమె మాజీ భర్త మదన్ మోహన్ తాజాగా చేస్తున్న బహిరంగ ఆరోపణలు, వాటికి ఆమె స్పందిస్తున్న తీరు నేపథ్యంలో ప్రభుత్వం అధికారుల నుంచి నివేదిక కోరింది. దీంతో వారు తాజాగా దేవాదాయమంత్రి ఆనం రామనారాయణరెడ్డికి సమగ్ర నివేదిక ఇచ్చారు. ఇందులో శాంతి ప్రవర్తన, వివాదాస్పద నిర్ణయాలు, విజయసాయిరెడ్డితో ఉన్న లింకు వంటి పలు అంశాలపై వివరాలు ఉన్నాయి. దీంతో అధికారులు ముందుగా దేవాదాయశాఖలో ఆమె ట్రాక్ రికార్డుపై వివరాలను రిపోర్టుగా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్