15 వాహనాల సీజ్... రెండు లక్షల జరిమానా విధింపు

53చూసినవారు
15 వాహనాల సీజ్... రెండు లక్షల జరిమానా విధింపు
పొదలకూరు పట్టణంలో శుక్రవారం నెల్లూరు రవాణా శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట వివిధ వాహనాలను ఆపి తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 15 వాహనాలను సీజ్ చేసి రెండు లక్షల రూపాయలు జరిమానా విధించారు. ఈ సందర్భంగా నెల్లూరు ఎంవీఐ బాల మురళీకృష్ణ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ కంపల్సరీ అని, సోషల్ మీడియాలో హెల్మెట్ వాడనవసరం లేదని వచ్చే వార్తలను నమ్మవద్దని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్