తిరుమల లడ్డు గురించి దుష్ప్రచారం చేయడం దురదృష్టకరం: అనంత

85చూసినవారు
తిరుమల లడ్డు గురించి దుష్ప్రచారం చేయడం దురదృష్టకరం: అనంత
తిరుమల లడ్డూ గురించి దుష్ప్రచారం చేయడం చాలా దురదృష్టకరమని అనంతపురం మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి శనివారం అన్నారు. టీడీపీ రాజకీయ స్వార్థం కోసం ప్రపంచంలో ఉన్న కోట్ల మంది భక్తుల విశ్వాసాలను దెబ్బ తీశారన్నారు. దీని మీద ఖచ్చితంగా విచారణ జరగాలని, ఏ పద్ధతిలో టెస్టులు చేశారు..? శాంపిల్స్ ను గుజరాత్ కి పంపించాల్సిన అవసరం ఏముందని అని ప్రశ్నించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం పూర్తి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్