క్వారీని వెంటనే ఆపాలని మంత్రికి వినతి

71చూసినవారు
క్వారీని వెంటనే ఆపాలని మంత్రికి వినతి
సోమందేపల్లి మండలం పాపిరెడ్డిపల్లి వద్ద ఉన్న క్వారిని వెంటనే మూసివేయాలని పాపిరెడ్డి పల్లి వద్ద శనివారం మంత్రి సవితమ్మకి కెజిబివి పాఠశాల సిబ్బంది, విద్యార్థులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్వారీ పేలుళ్ల వల్ల పాఠశాల భవనాలు బీటలు బారడంతో భయభ్రాంతులకు గురవుతున్నామని అన్నారు. వెంటనే క్వారీని మూసివేయాలని కోరారు. త్వరలో పరిశీలించి వారిపైన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.