పెనుకొండ నియోజకవర్గంలో బంపర్ మెజార్టితో గెలవబోతున్నాం: సవిత
పెనుకొండ నియోజకవర్గంలో బంపర్ మెజార్టీ తో గెలవబోతున్నామని టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ పేర్కొన్నారు. బుధవారం గోరంట్ల టీడీపీ కార్యాలయంలో టీడీపీ, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం సవితమ్మ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజలను పెద్ద ఎత్తున సమీకరించి పోలింగ్ కేంద్రాలకు వచ్చేలా చర్యలు తీసుకున్న బిజెపి, జనసేన, టిడిపి, నాయకులు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.