యాడికి మండలంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి శంకర్ నారాయణ మంగళవారం పర్యటించారు. మండల కేంద్రంలో రోడ్డు షో ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ. వచ్చే ఎన్నికలలో జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకోలేకపోతే ఇంటి వద్దకు సంక్షేమ పథకాలు అందవన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే పథకాలు ఆగిపోతాయని, వైసీపీకి ఓటు వేయాలని కోరారు.