విదేశీ విహంగాలను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయండి

80చూసినవారు
ఇచ్చాపురం మండలం తేలుకుంచి గ్రామానికి విదేశీ విహాంగాలు చేరుకొని సందడి చేస్తున్నాయి. ఈ సందర్భంగా గురువారం అటవీ శాఖ అధికారులు గ్రామంలో స్థానిక ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. విదేశీ పక్షులను కాపాడే బాధ్యత మనందరిదని, వాటి సంరక్షణ కోసం ప్రభుత్వాలు సహకారాలు అందిస్తున్నాయని తెలిపారు. వేటగాళ్లు, ఇతర జంతువుల భారి నుంచి విదేశీ పక్షులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని గుర్తు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్