జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. ఒకరికి గాయాలు
కంచిలి మండలంలోని బూరగాం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన మేరకు. గుర్తు తెలియని వాహనం ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇదే గ్రామానికి చెందిన మడ్డు షణ్ముఖరావు గాయాలపాలయ్యాడు. విషయం తెలుసుకున్న 108 సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని గాయపడిన వ్యక్తిని మెరుగైన చికిత్స కోసం సోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.