

కవిటి: భర్త ఎదుట భార్యపై దాడి.. ఆస్పత్రిలో మృతి
ఇచ్చాపురం నియోజకవర్గం కవిటి మండలంలో దారుణ హత్య జరిగింది. కవిటి మండలం ఆర్. కరాపాడుకు చెందిన కొణతల మీనా అనారోగ్యానికి గురైంది. ఈక్రమంలో భర్తతో కలిసి బైకుపై జాడుపూడి వెళ్లి చికిత్స పొందింది. తిరిగి గ్రామానికి వస్తుండగా కరాపాడు సమీపంలో శుక్రవారం సాయంత్రం కొందరు మీనాపై దాడికి తెగబడ్డారు. ఆమెను సోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయింది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.