శ్రీకాకుళంలో వైభవంగా ఆదిత్యుని కళ్యాణం

51చూసినవారు
శ్రీకాకుళం నగరంలోని ప్రముఖ అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారికి వైభవంగా కళ్యాణం నిర్వహించారు. చైత్ర బహుళ ఏకాదశిని ( మతత్రయ ఏకాదశి ) పురస్కరించుకొని స్వామివారికి కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ ఇప్పిలి శంకర శర్మ తెలిపారు. శనివారం ఉదయం 8గంటలకు కళ్యాణం ప్రారంభించారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు నడుమ ఈ కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్