వైభవంగా ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు

50చూసినవారు
ఇచ్చాపురం నియోజకవర్గంలోని పలు మండలాలలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. ఈ మేరకు కంచిలి మండలంలో కంచమ్మ తల్లి కమిటీ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ పరిధిలో పెద్ద శ్రీరాంపురం గ్రామంలో సింధు పోలమ్మ కమిటీ ఆధ్వర్యంలో దుర్గా దేవి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు మండలంలో దుర్గా దేవి మండపాలను ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ బాబు సందర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్