బీజేపీలో చేరిన వైసీపీ సీనియర్ నేత
లావేరు మండలం పెద్దలింగాలవలస సర్పంచ్, సీనియర్ వైసీపీ నాయకులు లుకలాపు అప్పలనాయుడు తన అనుచరవర్గంతో కలిసి శుక్రవారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి రాజమండ్రిలోని ఆమె క్యాంపు కార్యాలయంలో పార్టీ కండువాలు, కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గత కొన్ని రోజులుగా అప్పలనాయుడు ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ కు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే.