విపరీతమైన ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలు

53చూసినవారు
విపరీతమైన ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలు
జిల్లాలో భానుడు భగభగ మండుతున్నాడు. ఆదివారం 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. వడగాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండలు రోజురోజుకి తీవ్ర రూపం దాలుస్తున్నాయి. రెండు రోజులుగా వాతావరణంలో వేడి, ఎండ, ఉక్కపోతతో వృద్ధులు, చిన్నారులు, మహిళలు అల్లాడి పోతున్నారు. రహదారులన్నీ నిర్మానుష్యముగా మారుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్