ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కూటమి సమావేశం
సీతంపేటలో టీడీపీ, జనసేన, బీజేపీ మండల స్థాయి సమావేశాన్ని గురువారం నిర్వహించారు. నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పలు అంశాలపై వ్యూహాత్మక చర్చలు జరిపారు. క్షేత్రస్థాయిలో ఉమ్మడి మేనిఫెస్టో సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామన్నారు.