వర్షంలో కుర్చీ వేసుకుని మరీ.. టీడీపీ ఎమ్మెల్యే నిరసన (వీడియో)

66చూసినవారు
తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే కొలికపుడి శ్రీనివాసరావు శనివారం తిరువూరు పట్టణంలో పర్యటించారు. ఎమ్మెల్యే పర్యటించిన సమయంలో ఓ వార్డులో రోడ్డుపై వర్షపు నీరు నిలిచింది. దాంతో రోడ్లు భవనాల శాఖ అధికారుల నుంచి వివరణ తీసుకునేందుకు వారి కోసం గంట పాటు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వర్షంలోనే కుర్చీలో కూర్చొని నిరీక్షించారు. వర్షంలో తడుస్తూనే అధికారుల తీరుపై నిరసన తెలిపారు. గుంతలు ఎందుకు పూడ్చలేదంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్