మాడుగుల టీడీపీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. నిన్న టీడీపీ తరఫున బండారు సత్యనారాయణ మూర్తి నామినేషన్ వేశారు. ఆయనతో పాటు టీడీపీ రెబల్గా గవిరెడ్డి రామానాయుడు, పైలా ప్రసాద్ కూడా నామినేషన్ వేసి అందరికీ షాకిచ్చారు. రామానాయుడు, పైలా ప్రసాద్ నామినేషన్తో టీడీపీలో గందరగోళ పరిస్థితి నెలకొంది. నామినేషన్ విత్ డ్రా చేసుకోవాలని అధిష్టానం బుజ్జగించిన రామా నాయుడు, పైలా ప్రసాద్ వెనక్కి తగ్గట్లేదని సమాచారం.