వాలంటీర్లతో పింఛను పంపిణీ చేయొద్దని ఇసిఐ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిల్ను హైకోర్టు కొట్టివేసింది. ఇసిఐ నిర్ణయంపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు పింఛనుదారులు పిల్ దాఖలు చేశారు. వాలంటీర్ల వ్యవస్థలేని ఇతర రాష్ట్రాల్లో కూడా పింఛన్లు పంపిణీ చేస్తున్నారు కదా అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పింఛను పంపిణీకి ఈసీఐ ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడంతో పిల్ కొట్టివేస్తున్నట్లు తెలిపింది.