ఏపీలో ఠారెత్తిస్తున్న ఎండలు

54చూసినవారు
ఏపీలో ఠారెత్తిస్తున్న ఎండలు
ఏపీలో ఎండలు దంచికొడుతున్నాయి. ఆదివారం పలు చోట్ల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నంద్యాల జిల్లా చాగలమర్రి, తిరుపతి జిల్లా రేణిగుంటలో 45.5°డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రకాశం జిల్లా దరిమడుగులో 44.8°, అనకాపల్లి జిల్లా రావికమతంలో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 36 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 82 మండలాల్లో వడగాల్పులు వీచినట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్ల‌డించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్