ఏపీ ప్రజలు ఊపిరి పీల్చుకునే బడ్జెట్‌ ఇది: కేంద్రమంత్రి

1534చూసినవారు
ఏపీ ప్రజలు ఊపిరి పీల్చుకునే బడ్జెట్‌ ఇది: కేంద్రమంత్రి
ఐదేళ్ల జగన్‌ పాలనలో ఏపీ సుమారు 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు విమర్శించారు. మా ప్రభుత్వంలో కేంద్రం నుంచి అమరావతికి నిధుల ప్రకటన రావడం సంతోషదాయకం. భవిష్యత్తులో కూడా అవసరమైతే మరిన్ని నిధులు ఇస్తామనడం చాలా గౌరవం. వెనుకబడిన ప్రాంతాలకు కూడా ప్రత్యేక నిధులు ఇస్తామన్నారు. ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజలు ఊపిరి పీల్చుకునే బడ్జెట్‌ ఇది. బడ్జెట్‌ ద్వారా ఏపీకి నూతన విశ్వాసాన్ని కల్పించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు అని రామ్మోహన్‌ నాయుడు తెలిపారు.

సంబంధిత పోస్ట్