ఏపీ చరిత్ర మార్చే కీలక తరుణమిది: చంద్రబాబు

58చూసినవారు
ఏపీ చరిత్ర మార్చే కీలక తరుణమిది: చంద్రబాబు
ఏపీ చరిత్ర మార్చే కీలక తరుణం వచ్చిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. శుక్రవారం కర్నూలు జిల్లా ఆలూరులో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘కార్యకర్తలకు ఎమ్మెల్యే సీటు ఇచ్చిన ఘనత టీడీపీది. ఈ ఎన్నికలు రాష్ట్ర ప్రజల భవిష్యత్‌ను మారుస్తాయి. ఏపీ చరిత్ర మార్చే కీలక తరుణమిది. వైసీపీని చిత్తుగా ఓడించడమే కూటమి ధ్యేయం. కేంద్రంలో మళ్లీ ఎన్డీయే ప్రభుత్వమే వస్తుంది. కేంద్ర సహకారంతో రాష్ట్రం మరింత అభివృద్ధి జరుగుతుంది.’ అని అన్నారు.