అన్న క్యాంటీన్ కొత్త మెనూ ఇదే

62చూసినవారు
అన్న క్యాంటీన్ కొత్త మెనూ ఇదే
ఏపీలో పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లపై సీఎం చంద్రబాాబు తాజాగా మరో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అన్న క్యాంటీన్ మెనూ మార్చినట్లు సమాచారం. గతంలో కేవలం ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం అందించేవారు. అన్నంతో పాటు తృణ ధాన్యాలకు సంబంధించిన రాగి సంగటి, జొన్న రొట్టెలు, రాగి ముద్ద, సజ్జలుతో తయారు చేసే వంటకాలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అలాగే ధర కూడా రూ.10కి పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్