మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి నిన్న వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన రాజకీయ స్టాండ్ ఏంటనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. మాజీ మంత్రి నేడు జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి వపన్ కల్యాణ్తో భేటీ కానున్నారు. ఈ భేటీ అనంతరం ఆయన జనసేన కండువా కప్పుకోనున్నారని సమాచారం. బాలినేనితో మరికొందరు కీలక నాయకులు కూడా జనసేనలో చేరనున్నారని తెలుస్తోంది.