ప్రపంచ మలేరియా దినోత్సవం పై ర్యాలీ
మెరకముడిదాం మండలంలో గల మెరకముడిదాం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా గురువారం వైద్యాధికారి కె అజిత్ బాబు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రజలందరూ దోమ తెరలు వాడి, దోమకాటుకు గురికాకుండా మలేరియా వ్యాధి రాకుండా కాపాడుకోవాలని పలు నినాదాలు చేసారు. ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా ప్రతి శుక్రవారం డ్రైడే ఫ్రైడే పాటించాలని, ఇంటి చుట్టూ పరిసరములను, పరిశుభ్రంగా ఉంచాలని అవగాహన కల్పించారు.