రోడ్డు ప్రమాదంలో భర్త మృతి.. తట్టుకోలేక భార్య ఆత్మహత్య

81చూసినవారు
రోడ్డు ప్రమాదంలో భర్త మృతి.. తట్టుకోలేక భార్య ఆత్మహత్య
ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. శనివారం రోడ్డు ప్రమాదంలో చంటి అనే వ్యక్తి మృతి చెందాడు. భర్త మరణం తట్టుకోలేక నాయన భవానీ (20) అనే మహిళ ఆదివారం గడ్డి మందు తాగింది. కుటుంబీకులు వెంటనే రిమ్స్‌లో అడ్మిట్ చేశారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో మృతి చెందింది. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో కన్నీటి ఛాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్