
విశాఖ: రైల్వే ప్రైవేటీకరణ ఆపాలి
రైల్వే ప్రయివేటీకరణ ఆపాలని, భద్రతా ప్రమాణాలు చేపట్టాలని సిఐటియు జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.హేమలత అన్నారు. రైల్వే ప్రయివేటీకరణ ఆపాలని, భద్రతా చర్యలు చేపట్టాలని కోరుతూ శనివారం అల్లూరి విజ్ఞాన కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యాన రాష్ట్ర సదస్సు జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ.. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజల సంపదైన రైల్వేను పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతోందన్నారు.