సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం
మే 13న జిల్లాలో జరగనున్న ఎన్నికలకు యంత్రాంగం సిద్ధంగా ఉందని, ఆ దిశగా పటిష్ట ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి మల్లికార్జున పేర్కొన్నారు. విశాఖ జిల్లాలో 20, 12, 373 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద తాగునీరు, షామియానాలు ఏర్పాటు చేశామని చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.