పోగొట్టుకున్న మొబైల్స్ బాధితులకు అందజేత

1061చూసినవారు
నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న బాధితులకు టౌన్ సీఐ క్రాంతికుమార్ రికవరీ చేసిన ఏడు మొబైల్ ఫోన్లను బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రైమ్ టీమ్ సహాయంతో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి వాటిని రికవరీ చేశామని పేర్కొన్నారు. సిబ్బందికి ఆయన అభినందనలు తెలియజేశారు. టౌన్ ఎస్స్ సుధాకర్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్