నిప్పుల కుంపటి....!!
అచ్చుతాపురం మండలంలో శనివారం ఉదయం పది గంటలకే ఎండ జోరందుకుంటోంది. సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగుతున్నది. తర్వాత ఎండ తగ్గినా ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మధ్యాహ్న సమయాల్లో రోడ్లపై రావాలంటేనే జనం బెంబేలెత్తిపోతున్నారు. ఇళ్లలో ఫ్యాన్ల కింద సేదదీరినా చెమట ఆగడంలే దంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వచ్చే రోహిణి కార్తెల్లో ఎండతీ వ్రత ఇంకెంత భయంకరంగా ఉంటుందోనని తల్లడిల్లిపోతున్నారు.