ఏపీ అభివృద్ధి చెందాలంటే కేంద్రం సాయం అవసరమని చంద్రబాబు తెలిపారు. కుప్పంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. "ఏపీ అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణే టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల అజెండా. ఈసారి 160 అసెంబ్లీ, 24 లోక్సభ స్థానాలు గెలవాలి. మేం అధికారంలోకి వచ్చాక రూ.4 వేల పింఛను ఇంటివద్దకే తెచ్చి ఇస్తాం. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లను కాపాడింది టీడీపీనే." అని తెలిపారు.