పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత కునాల్ ఘోష్ బీజేపీకి సవాల్ విసిరారు. డైమండ్ హార్బర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిని ప్రకటించటంలో జాప్యం చేస్తుందని అన్నారు. ఆ స్థానంలో పోటీకి నిలపడానికి బీజేపీకి అభ్యర్థులే దొరకటం లేదని ఎద్దేవా చేశారు. బీజేపీ నేత సువేందు అధికారిని అక్కడి నుంచి పోటీకి దింపాలని సవాల్ విసిరారు. కాగా ఇక్కడ మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ గత రెండు ఎన్నికల్లో భారీ మెజర్టీతో గెలుపొందారు.