ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు సంబంధించి టీడీపీ, జనసేనతో కలిసి పోటీ చేస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వెల్లడించారు. "NDAలో చేరాలని నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. దేశాభివృద్ధికి మూడు పార్టీలు కట్టుబడి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రజల మేలు కోసం కలిసి పనిచేస్తాం." అని ట్విట్టర్ వేదికగా నడ్డా ప్రకటించారు.