AP: ప్రస్తుత ఎన్నికల్లో తాము మొత్తం 400కు పైగా ఎంపీ సీట్లు సాధిస్తామని కేంద్ర మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ధర్మవరం సభలో ఆయన మాట్లాడుతూ.. "పవిత్ర హిందూపురానికి నమస్కరిస్తున్నా. రాముడు, జఠాయువు కలిసిన పుణ్యభూమి లేపాక్షికి ప్రణామం చేస్తున్నా. లోక్సభ రెండు దశల ఎన్నికలు పూర్తయ్యాయి. వీటిలో ప్రధాని మోదీ సెంచరీ కొడతారు. మొత్తంగా 400కు పైగా సీట్లు సాధిస్తాం." అని పేర్కొన్నారు.