అత్తిలి మండలం మంచిలి గ్రామ సచివాలయం వద్ద శనివారం యుఐపీ కార్యక్రమంలో భాగంగా చంటి బిడ్డలకు వ్యాధి నిరోధక టీకాలు అందించారు. ఏఎన్ఎం అనంతలక్ష్మి, ఆశా సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, వలంటీర్లు పాల్గొన్నారు. 6నెలలు వయసు పిల్లలు నుంచి యుక్త వయసు వచ్చిన పిల్లలకు వయసుని బట్టి వివిధ రకాల వ్యాక్సిన్లు అందించారు.