ఆక్రమణలకు బాధ్యులైన అధికారులపై చర్యలు తప్పవు: మంత్రి నిమ్మల

58చూసినవారు
వేలాది ఎకరాలకు సాగునీరు అందించే కెసి కెనాల్ కు సంబంధించి పాలసాగర్ ఉప కాలువ ఆక్రమణలకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గురువారం శాసనసభా సమావేశాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఆయన ఈ వ్యాఖ్యలను చేశారు. రెవిన్యూ నంబర్లు మార్చి రిజిస్ట్రేషన్లు జరిగాయన్నారు. తప్పు చేసిన వారిపై చర్యలు తప్పమన్నారు.

సంబంధిత పోస్ట్