ఏపీకి ప్రత్యేక హోదా ఊపిరి లాంటిదని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. హోదా విషయంలో తల్లి లాంటి ఏపీని జగన్ వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. "వ్యక్తిగత కారణాల వల్ల నేను ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టలేదు. అలా అనుకుంటే 2019లోనే ఇక్కడ అడుగు పెట్టేదాన్ని. పోరాడకపోతే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎప్పటికీ రాదు. హోదా ఇస్తానన్న ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ." అని పేర్కొంటూ షర్మిల భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు.