జమ్మూకశ్మీర్‌లో చివరి దశ ఎన్నికల పోలింగ్‌ షురూ (వీడియో)

56చూసినవారు
జమ్మూకశ్మీర్‌‌లో చివరి దశ పోలింగ్‌ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. జమ్మూ ప్రాంతంలో 24, కశ్మీర్‌ లోయలో 16 కలిపి మొత్తం 40 స్థానాలకు ఈ దశలో పోలింగ్ జరుగుతోంది. ఆయా స్థానాల్లో మొత్తం 415 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 5,060 పోలింగ్‌ కేంద్రాల్లో దాదాపు 20 వేల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. కాగా, జమ్మూకశ్మీర్‌లో ఇప్పటికే రెండు దశల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్